వైసీపీది అరాచక పాలన

ABN , First Publish Date - 2022-09-30T09:31:12+05:30 IST

వైసీపీది అరాచక పాలన

వైసీపీది అరాచక పాలన

రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తోంది

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌


తిరుపతి సిటీ, సెప్టెంబరు 29: అవినీతి, అసమర్థ, అక్రమ, అరాచక పాలనతో  వైసీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ కక్షధోరణితో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు ఆ ప్రాంత రైతులు, అన్ని పార్టీల నేతలను అక్రమ కేసులు, వేధింపులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించడమే కాకుండా రూ.8లక్షల కోట్ల అప్పు చేసి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో పడేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఇసుక, పన్నుల నుంచి రాష్ర్టానికి వచ్చే ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని, కేవలం మద్యం నుంచి వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర పాలన సాగుతుండడం దురదృష్టకరమన్నారు. టీడీపీ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోతోందన్నారు. రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీజేపీ, జనసేన కూటమి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-30T09:31:12+05:30 IST