చంద్రబాబు కుటుంబంపై అసభ్య పోస్టులు
ABN , First Publish Date - 2022-09-30T09:56:21+05:30 IST
చంద్రబాబు కుటుంబంపై అసభ్య పోస్టులు
వైసీపీ కార్యకర్తకు ఖమ్మం తెలుగుయువత దేహశుద్ధి
ఖమ్మం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వైసీపీ కార్యకర్తకు ఖమ్మం తెలుగు యువత నాయకులు దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణాజిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్త కోదాటి నర్సింహ.. ఖమ్మంలో ఆర్ఎంపీగా పనిచేసే పనిచేస్తూ... తరచూ తన స్వగ్రామానికి వెళ్లి అక్కడ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. రెండురోజుల క్రితం చంద్రబాబు కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఒక పోస్టు పెట్టాడు. విషయం తెలుసుకున్న ఖమ్మం తెలుగు యువత నాయకులు.. అతడికి ఫోన్ చేసి ఎందుకు పెట్టావని ప్రశ్నించగా.. దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన తెలుగుయువత కార్యకర్తలు గురువారం నర్సింహను కలిసి.. క్షమాపణ చెప్పాలని కోరారు. అప్పుడు కూడా నర్సింహ అగౌరవంగా మాట్లాడడంతో దేహశుద్ధి చేశారు.