వైసీపీ పాలనపై టీడీపీ ‘దసరా కళా ప్రదర్శన’

ABN , First Publish Date - 2022-09-30T10:00:26+05:30 IST

వైసీపీ పాలనపై టీడీపీ ‘దసరా కళా ప్రదర్శన’

వైసీపీ పాలనపై టీడీపీ ‘దసరా కళా ప్రదర్శన’

తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై వీధి నాటకాలు, హరికథలు, బుర్రకథల వంటి కళా ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నడుం బిగించింది. టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్‌ నేతృత్వంలో తిరుపతిలో గురువారం ‘దసరా కళా ప్రదర్శన’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కీచకవధ ఘట్టాన్ని ప్రదర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో కంసవధ వీధి నాటకాన్ని ప్రదర్శించారు. టీడీపీ నాయకులు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, పులివర్తి నాని, ఆర్సీ మునికృష్ణ, రవినాయుడు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో దసరా కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని నరసింహ ప్రసాద్‌ చెప్పారు.

Updated Date - 2022-09-30T10:00:26+05:30 IST