‘ఏపీలో బీసీలు చాలా మంది ఉన్నారు’

ABN , First Publish Date - 2022-05-17T23:45:36+05:30 IST

‘ఏపీలో బీసీలు చాలా మంది ఉన్నారు’

‘ఏపీలో బీసీలు చాలా మంది ఉన్నారు’

గుంటూరు: తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్ అన్నారు. వైసీపీ బీసీలకు ఇవ్వాలనుకుంటే ఏపీలో బీసీలు చాలా మంది ఉన్నారని తెలిపారు. వైసీపీ కోసం పని చేసిన బీసీ నేతలు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. వారందరినీ కాదని తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం అన్యాయమన్నారు. సీఎం జగన్ ఏపీలోని బీసీ లను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

Updated Date - 2022-05-17T23:45:36+05:30 IST