వెలుగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ను మార్చిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2022-08-23T03:11:26+05:30 IST
వెలుగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ను మార్చిన జగన్ సర్కార్
విజయవాడ: వెలుగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ను జగన్ సర్కార్ మార్చింది. హైదరాబాద్కు చెందిన గుత్తేదారు జయప్రకాష్, గాయత్రిలను తొలగించారు. కొత్త టెండర్లు పిలిచి వేరే ఏజెన్సీకి అప్పగించాలని ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పనుల వేగవంతం కోసమే కాంట్రాక్టర్ మార్పు అని ప్రభుత్వం వెల్లడించింది. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల మార్పును వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. గతంతో టీడీపీ అనుసరించిన 60(C) నిబంధననే సాకుగా చూపి, వెలుగొండ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీని వైసీపీ ప్రభుత్వం తప్పించింది.