లంచం తీసుకుంటున్న సమయంలో వీడియో... ఆ వీడియో కాస్త వైరల్
ABN , First Publish Date - 2022-06-27T21:41:07+05:30 IST
జిల్లాలోని భీమడోలు పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఏలూరు: జిల్లాలోని భీమడోలు పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లుల కోసం పంచాయతీ కార్యదర్శి రమేష్ గుప్తా ఓ వ్యక్తి వద్ద రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఓ వ్యక్తి వీడియో తీసీ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. పంచాయతీ కార్యదర్శి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.