AP News: మంత్రి బొత్స వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి

ABN , First Publish Date - 2022-09-10T23:27:24+05:30 IST

Vijayanagaram: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana)వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవమేనని.. అయితే ఇప్పుడు పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని.. మరో రెండు నెలల్లో సీపీఎస్పై ప్ర

AP News: మంత్రి బొత్స వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి

Vijayanagaram:  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana)వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవమేనని.. అయితే ఇప్పుడు పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని.. మరో రెండు నెలల్లో సీపీఎస్పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని బొత్స చెప్పడంతో సంఘం నాయకులు అసంతృప్తికి లోనయ్యారు. బొత్స వ్యాఖ్యలను బట్టి చూస్తే పాత పెన్షన్ విధానం అమలవుతుందనే నమ్మకం పోయిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. పీఆర్సీపై ఇప్పటికీ ఉద్యోగులందరూ నిరుత్సాహంగానే ఉన్నారని, 11వ పీఆర్సీ లోపాలను 12వ పీఆర్సీలో సరిదిద్దమని పట్టుబడతామని చెప్పారు. పాత పెన్షన్ అమలు చేయాలన్నదే తమ ఏకైక అజెండా అని స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-10T23:27:24+05:30 IST