AP News: రాష్ట్రాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టాడు : సాకే శైలజానాథ్
ABN , First Publish Date - 2022-09-25T00:54:35+05:30 IST
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడని ఎపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను చంపేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడని విమర్శించారు. రాజధాని విషయంలో మాట మార్చి, మడమ తిప్పాడని, అవసరం కోసం హామీలు.. అధికారం వచ్చాక అవహేళన చేస్తూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నాడని ధ్వ
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడని ఎపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను చంపేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడని విమర్శించారు. రాజధాని విషయంలో మాట మార్చి, మడమ తిప్పాడని, అవసరం కోసం హామీలు.. అధికారం వచ్చాక అవహేళన చేస్తూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు. అధికార మదమెక్కిన మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టును తమ పార్టీ ఖండిస్తోందన్నారు.