AP News: 2 ఎకరాల్లో కృష్ణంరాజు స్మృతివనం: రోజా

ABN , First Publish Date - 2022-09-29T21:59:11+05:30 IST

పశ్చిమ గోదావరి: ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరయ్యారు

AP News: 2 ఎకరాల్లో కృష్ణంరాజు స్మృతివనం: రోజా

పశ్చిమ గోదావరి: ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు (Krishnam raju) ఇటీవల మృతిచెందారు. తెలంగాణ ప్రభుత్వం (TRS Govt) ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో కుటుంబసభ్యులు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు (Karumuru Nagaswara rao), రోజా (Roja), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరయ్యారు. తీరప్రాంతంలో 2 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణంరాజు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి రోజా ఈ సందర్భంగా ప్రకటించారు.ఉప్పలపాటి వంశీయులకు ఎంత ఆదరణ ఉందని, కృష్ణంరాజు సినిమాల్లో రెబల్ స్టార్ .. రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని కొనియాడారు. రెబల్‌స్టార్‌ మృతి తీరని లోటు అని.. ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిరస్థానం సంపాదించుకున్నారని మంత్రులు పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. 

Updated Date - 2022-09-29T21:59:11+05:30 IST