రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-08T00:25:11+05:30 IST
రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్ ఆత్మహత్య
పల్నాడు: రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కిషోర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రైతు పొలంలోకి వరద నీటి కోసం రెవెన్యూ అధికారులు గండి కొట్టారు. అడ్డుకున్న రైతులను అధికారులు పోలీసులతో నెట్టివేయించారని వాపోతున్నారు. అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు కిషోర్ మృతి చెందాడు. రెవెన్యూ అధికారుల తీరుపై బాధిత కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.