ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు

ABN , First Publish Date - 2022-08-08T22:41:20+05:30 IST

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు

శ్రీకాకుళం: జిల్లాలోని మరోసారి ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు దాడిలో ముగ్గురు మృతి చెందారు. మళ్ళీ ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో అక్కడ ప్రజలు హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని గ్రాస్థులతో పాటు స్థానికులు వాపోతున్నారు. 

Updated Date - 2022-08-08T22:41:20+05:30 IST