విషాదం.... పాము కాటుకు వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-25T02:56:50+05:30 IST

జిల్లాలోని బనగానపల్లె మండలం మీరాపురం వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురై రైతు ఇమాంసా (55) మృతి చెందాడు.

విషాదం.... పాము కాటుకు వ్యక్తి మృతి

నంద్యాల: జిల్లాలోని బనగానపల్లె మండలం మీరాపురం వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురై రైతు ఇమాంసా (55) మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బోరున విలపిస్తూ.. కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-25T02:56:50+05:30 IST