సీఎంజగన్ పై మండిపడ్డ నారా లోకేష్
ABN , First Publish Date - 2022-06-26T22:56:40+05:30 IST
సీఎంజగన్ పై మండిపడ్డ నారా లోకేష్
విజయవాడ: అమరావతిపై జగన్ మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలోనేమో అమరావతికి భూకంప ప్రమాదమన్నారు. అమరావతికి ముంపు ప్రమాదముందని ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానం అన్నారని ధ్వజమెత్తారు. నేడేమో ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టారని చెప్పారు. అమ్మ లాంటి అమరావతిపై జగన్ కుట్రలకు అంతే లేదన్నారు.