మూగ యువతిపై లైంగిక దాడి

ABN , First Publish Date - 2022-05-16T08:43:56+05:30 IST

మూగ యువతిపై లైంగిక దాడి

మూగ యువతిపై లైంగిక దాడి

తెనాలిలో పట్టపగలే దారుణం.. పోలీసుల అదుపులో నిందితుడు


తెనాలి క్రైం, మే 15: మిట్ట మధ్యాహ్నం ఇంటిలో ఒంటరిగా ఉన్న 20 ఏళ్ల మూగ యువతిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. తల్లిదండ్రులు శనివారం కూలి పనుల కోసం వెళ్లగా ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గుర్తించిన ఇదే ప్రాంతానికి చెందిన కొదముల రాజు అలియాస్‌ జక్రయ (27) ఆ యువతిపై అత్యాచారం చేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు యువతి సైగల ద్వారా జరిగిన దారుణాన్ని వివరించింది. ఆ రాత్రే యువతి తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు జక్రయ్యను అదుపులోకి తీసుకుని అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.  


బాధిత కుటుంబానికి అండగా టీడీపీ

ఈ సంఘటన వెలుగులోకి రాగానే పట్టణ తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నాయకత్వంలో ఆదివారం ఉదయం ఆపార్టీ నాయకులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చి, కొంత ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో చిన్నారుల నుంచి వృద్ధులు, వికలాంగులు, ఆఖరికి గర్భిణులపై వరుస అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నా జగన్‌ ప్రభుత్వంలో నిందితులపై కఠిన చర్యలు లేవు. అందువల్లే మృగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళలు బయట తిరగాలన్నా, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా భయం భయంతో ఉండాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం వల్ల ఏర్పడింది’ అని అన్నారు. జిల్లా అధికారులు వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాం్‌ చేశారు. హోంమంత్రిగా మహిళ ఉండి కూడా ఇలాంటి సంఘటనలపై స్పందన లేకపోవడం సిగ్గుచేటని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ కమిటీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు.

Updated Date - 2022-05-16T08:43:56+05:30 IST