సుబ్రహ్మణ్యంది మూమ్మాటికి హత్యే: శ్రవణ్
ABN , First Publish Date - 2022-05-22T08:36:57+05:30 IST
సుబ్రహ్మణ్యంది మూమ్మాటికి హత్యే: శ్రవణ్
కాకినాడ క్రైం, మే 21: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంది మూమ్మాటికి హత్యేనని, ఈ ఘటనను తమ్మిని బమ్మిని చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణకుమార్ ఆరోపించారు. శనివారం కాకినాడ విచ్చేసిన ఆయన జీజీహెచ్ మార్చురీవద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత బిడ్డను చంపేసి, కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి అతని ఇంటి ముందే వదిలేసిన ఘటనలో నిందితులపై 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ వేయకపోతే, కాకినాడలోకి ఒక వాహనాన్ని కూడా అనుమతించబోమని, హైవేను కూడా దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు.