అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-22T08:54:29+05:30 IST
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుడిబండ/ఉరవకొండ, మే 21: సేద్యపు నష్టాల నుంచి గట్టెక్కలేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప (54)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి(60) సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై శనివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.