జగన్‌.. వ్యాట్‌ ఎంత తగ్గిస్తారో చెప్పాలి: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2022-05-22T08:18:23+05:30 IST

జగన్‌.. వ్యాట్‌ ఎంత తగ్గిస్తారో చెప్పాలి: లంకా దినకర్‌

జగన్‌.. వ్యాట్‌ ఎంత తగ్గిస్తారో చెప్పాలి: లంకా దినకర్‌

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించనున్నదని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సబ్సిడీ ద్వారా గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.200 తగ్గింపుతో 9కోట్ల కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. కేంద్రం ఇంతకుముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించినా.. ఏపీ ప్రభుత్వం మిన్నకున్నదని, కనీసం ఇప్పుడైనా పెట్రోల్‌, డీజిల్‌పై ఎంత వ్యాట్‌ తగ్గిస్తారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-22T08:18:23+05:30 IST