చిన్నారి జోషిక చికిత్సకు రూ.2 లక్షలకు పైగా దాతల సాయం

ABN , First Publish Date - 2022-05-22T08:50:22+05:30 IST

చిన్నారి జోషిక చికిత్సకు రూ.2 లక్షలకు పైగా దాతల సాయం

చిన్నారి జోషిక చికిత్సకు రూ.2 లక్షలకు పైగా దాతల సాయం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


కొండపి, మే21: బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రకాశం జిల్లా కొండపికి చెందిన చిన్నారి జోషికకు పెద్దమనసుతో సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. చిన్నారి వ్యధను వివరిస్తూ శనివారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో  ‘పాపను కాపాడండయ్యా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి పలువురు ఫోన్‌ చేసి తనతో మాట్లాడి బాధను పంచుకున్నారని చెన్నైలో ఉన్న జోషిక తండ్రి చంద్రశేఖర్‌  ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. శనివారం .సాయంత్రానికి రూ.2లక్షలకు పైగా దాతలు సాయం అందించారని, తమ బాధను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినందుకు ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చాలామంది అకౌంట్‌కు డబ్బులు వేస్తూనే ఉన్నారని, ఫోన్‌లో పరామర్శించి సాయం అందిస్తామని హామీ ఇస్తున్నారని చెప్పారు.  

Updated Date - 2022-05-22T08:50:22+05:30 IST