అదుపులోనే నేరాలు.. ఆందోళనకర స్థాయిలో లేవు

ABN , First Publish Date - 2022-05-22T08:34:58+05:30 IST

అదుపులోనే నేరాలు.. ఆందోళనకర స్థాయిలో లేవు

అదుపులోనే నేరాలు.. ఆందోళనకర స్థాయిలో లేవు

ఎమ్మెల్సీ డ్రైవర్‌ మృతి కేసులో విచారణ కొనసాగుతోంది: డీజీపీ 


తిరుపతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేరాలు అదుపులోనే ఉన్నాయని, గత ఏడాదితో పోల్చుకుంటే ఆందోళన చెందే స్థాయిలో లేవని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. తిరుపతిలో శనివారం జరిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ మృతి కేసులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు. గంజాయిని అరికట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మాజీ మంత్రి నారాయణపై అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుని అరెస్టు చేశామని, ఆయన బెయిల్‌పై విడుదల కావడంలో పోలీసుల వైఫల్యం ఏమాత్రం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Updated Date - 2022-05-22T08:34:58+05:30 IST