AP : మళ్లీ పోలీసుల రంగప్రవేశం.. అజ్ఞాతంలోకి Pattabhi.. హైడ్రామా!

ABN , First Publish Date - 2021-10-24T07:47:32+05:30 IST

AP : మళ్లీ పోలీసుల రంగప్రవేశం.. అజ్ఞాతంలోకి Pattabhi.. హైడ్రామా!

AP : మళ్లీ పోలీసుల రంగప్రవేశం.. అజ్ఞాతంలోకి Pattabhi.. హైడ్రామా!

  • రాజమండ్రి నుంచి రాకలో.. 
  • పొట్టిపాడు వద్ద కాన్వాయ్‌ అడ్డగింత


విజయవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి... మరోసారి పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళనతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు సృష్టించిన హైడ్రామాయే ఈ భయానికి కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. హనుమాన్‌జంక్షన్‌ దాటి  పొట్టిపాడు టోల్‌ప్లాజాకు 10.30 ప్రాంతంలో చేరుకున్నారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు పట్టాభి వెంట వస్తున్న ఇతర వాహనాలను నిలిపివేశారు.


పట్టాభి కారును తమ వెంట తీసుకెళ్లారు. పట్టాభి కారు డ్రైవర్‌, ఆయన వెంట ఉన్న బాడీగార్డు ఫోన్లు కూడా పని చేయలేదు. సుమారు గంట తర్వాత పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టాభి కాన్వాయ్‌లో ఎక్కువ వాహనాలు ఉండటంతో వాటిని మాత్రమే నిలిపివేశామని పోలీసులు తెలిపారు. పట్టాభి వాహనాన్ని మాత్రం అనుమతించామన్నారు.

Updated Date - 2021-10-24T07:47:32+05:30 IST