APNews: పొన్నూరులో ముస్లింల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-27T17:51:46+05:30 IST

జిల్లాలోని పొన్నూరులో ముస్లింలు ఆందోళనకు దిగారు. ముస్లిం నేత ఇల్లు కబ్జాకు వైసీపీ నేత తోట రాంబాబు ప్రయత్నించాడు.

APNews: పొన్నూరులో ముస్లింల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని పొన్నూరులో ముస్లింలు ఆందోళనకు దిగారు. ముస్లిం నేత ఇల్లు కబ్జాకు వైసీపీ నేత తోట రాంబాబు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రోద్బలంతో దౌర్జన్యం  చేస్తున్నారని...  పోలీసులు కూడా కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని, పొన్నూరు పట్టణంలో ముస్లింలను బ్రతకనివ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా వైసీపీ గెలుపు కోసం పని చేసిన వారిమేనని స్పష్టం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ముస్లిం ఆస్తులు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ముస్లింలు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-05-27T17:51:46+05:30 IST