ఎందుకు వణికిపోతుందో నాకే అర్థం కావడం లేదు: రఘురామ

ABN , First Publish Date - 2022-07-03T22:21:29+05:30 IST

ఎందుకు వణికిపోతుందో నాకే అర్థం కావడం లేదు: రఘురామ

ఎందుకు వణికిపోతుందో నాకే అర్థం కావడం లేదు: రఘురామ

హైదరాబాద్: రేపు అల్లూరి జయంతి వేడుకలకు హాజరవుతానని ఎంపీ రఘురామ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వం నేనంటే ఎందుకు వణికిపోతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే నాకు వీవీఐపీ పాస్ ఇవ్వాలి.. కానీ ఇవ్వలేదన్నారు. ఎవరు చెప్పారని వీవీఐపీ పాస్ ఇవ్వట్లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీజీ రవిప్రకాష్ తన నెంబర్ బ్లాక్ చేశారని మండిపడ్డారు. ధైర్యముంటే నన్ను ఆపుకోండి.. చూద్దామని సవాల్ విసిరారు. 


ప్రభుత్వం ఓ వింత వ్యాధితో బాధపడుతోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. నాకెలాంటి అవమానం జరిగినా.. అది ప్రధానికి జరిగినట్టేనన్నారు. అవమాన పరిణామాలు జులై 18 తర్వాత తీవ్రంగా ఉంటాయాన్నారు. తన ఫ్లెక్సీలను కట్టినవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందని, పులి కడుపున పిల్లి పుట్టిందన్నారు.

Updated Date - 2022-07-03T22:21:29+05:30 IST