శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన్ కేసు నిర్ధారణ కాలేదు: డీఎంహెచ్వో
ABN , First Publish Date - 2021-12-08T00:16:04+05:30 IST
జిల్లాలో ఒమైక్రాన్ కేసు నిర్ధారణ కాలేదని డీఎంహెచ్వో జగన్నాధం తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన సంతబొమ్మాలి మండలం ఉమిలాడ వాసికి కరోనా నిర్ధారించినట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం: జిల్లాలో ఒమైక్రాన్ కేసు నిర్ధారణ కాలేదని డీఎంహెచ్వో జగన్నాధం తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన సంతబొమ్మాలి మండలం ఉమిలాడ వాసికి కరోనా నిర్ధారించినట్లు వెల్లడించారు. శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించామని డీఎంహెచ్వో తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం బాధితుడిని రిమ్స్లో వైద్యుల పర్యవేక్షలో ఉంచామన్నారు.