టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

ABN , First Publish Date - 2022-05-25T01:22:05+05:30 IST

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

శ్రీసత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ (TDP) కార్యకర్తలపై కొడవళ్లతో వైసీపీ (YCP) వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త నర్సింహమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే టీడీపీ మాజీ  సర్పంచ్‌ బాలాజీ ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. గ్రామ దేవతల జ్యోతులు తరలిస్తుండగా వివాదం తలెత్తింది. 

Updated Date - 2022-05-25T01:22:05+05:30 IST