కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
ABN , First Publish Date - 2022-07-27T21:08:06+05:30 IST
చిల్లకూరు మండలం వరగలి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
తిరుపతి: చిల్లకూరు మండలం వరగలి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.