‘ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌’లో AP నెంబర్ వన్

ABN , First Publish Date - 2022-06-30T19:43:19+05:30 IST

‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’’లో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.

‘ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌’లో AP నెంబర్ వన్

అమరావతి: ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’’లో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ఏపీలో 2019 మార్చి వరకు ఉన్న పురోగతిని కేంద్రం పరిగణలోకి తీసుకుంది. గురువారం ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) విడుదల చేశారు. ఇందుకోసం 2019 మార్చి వరకు ఆయా రాష్ట్రాల పురోగతిని కేంద్రం పరిగణలోకి తీసుకుంది. టాప్ ఎచీవర్స్‌లో ఏడు రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. కాగా... టీడీపీ ప్రభుత్వం హయాంలో వరుసగా 2017, 2018లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-06-30T19:43:19+05:30 IST