ఏపీ సీఎం అప్పుల అప్పారావుగా మారారు: Sailajanth

ABN , First Publish Date - 2022-04-28T19:14:28+05:30 IST

ఏపీ సీఎం జగన్ అప్పుల అప్పారావు గా మారారని పిసిసి చీఫ్ శైలజనాథ్ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం అప్పుల అప్పారావుగా మారారు: Sailajanth

కర్నూలు: ఏపీ సీఎం జగన్ అప్పుల అప్పారావుగా మారారని పిసిసి చీఫ్ శైలజనాథ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఢిల్లీలో మంత్రిని బయటపెట్టి లోపల చీవాట్లు పెట్టించుకున్నారని తెలిపారు. ఏపీ మర్యాదను సీఎం మంట గలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలను ఆడుకునే వాళ్లుగా మారుస్తున్నారన్నారు. లక్ష 10 వేల కోట్లు పంచామంటున్నారని... 70 వేల కోట్లకు ప్రభుత్వం లెక్క చూపడం లేదని తెలిపారు. మంత్రి బుగ్గనకు రోషం ఉంటే రాజీనామా చేయాలని... మంత్రిని బయటకు పంపారంటేనే పరువుపోయిందని ఆగ్రహించారు. మంత్రులు భజనరాయుళ్లుగా మారిపోయారన్నారు. ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు. ఎల్జీ పాలీమార్స్‌లో ప్రమాద బాధితులకు కోటి ఇస్తారని... అత్యాచార బాదితులకు రూ.5 లక్షలు ఇస్తారా అని శైలజానాథ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-04-28T19:14:28+05:30 IST