AP people ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-13T23:33:33+05:30 IST

ఏపీ ప్రజలు (AP people) ఫ్రస్టేషన్‌లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

AP people ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: చంద్రబాబు

కుప్పం: ఏపీ ప్రజలు (AP people) ఫ్రస్టేషన్‌లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థను ధ్వంసం చేస్తే మళ్లీ నిర్మించడం చాలా కష్టమన్నారు. ఏపీలో హత్యలు, అత్యాచారాలు, దాడులు మితిమీరిపోయాయని తెలిపారు. వ్యక్తి అభివృద్ధి కన్నా.. వ్యవస్థ అభివృద్ధి ముఖ్యమన్నారు. తాను వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే.. ఇప్పుడున్న పాలకులు వ్యక్తి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తప్పుబట్టారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. చివరకు తనను కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, మూర్ఖులు, రౌడీలు, అజ్ఞానులతో పోరాడాల్సిన పరిస్థితి ఎదురైందని చంద్రబాబు పేర్కొన్నారు.


Read more