జగన్‌ మాయలు, మోసాలను ఏపీ ప్రజలు గుర్తించాలి: జస్టిస్‌ శ్రావణకుమార్‌

ABN , First Publish Date - 2022-05-19T01:33:25+05:30 IST

సీఎం జగన్‌ చేస్తున్న మాయలు, మోసాలను ఏపీ ప్రజలు గుర్తించాలని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్వవస్థాపకుడు జస్టిస్‌ శ్రావణ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జగన్‌ మాయలు, మోసాలను ఏపీ ప్రజలు గుర్తించాలి: జస్టిస్‌ శ్రావణకుమార్‌

విజయవాడ: సీఎం జగన్‌ చేస్తున్న మాయలు, మోసాలను ఏపీ ప్రజలు గుర్తించాలని జైభీమ్‌ భారత్‌ పార్టీ వ్వవస్థాపకుడు జస్టిస్‌ శ్రావణ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రాభివృద్ధికి పాటుపడేవారిని గుర్తించడంలో విఫలమయ్యారని తప్పుబట్టారు. కేవలం రాజకీయ అజెండాతోనే వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేస్తే మన రాష్ట్ర సమస్యలను ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. రాజ్యసభకు ఖాళీ అయిన స్థానాలలో పక్కన ఉన్న రాష్ట్రానికి చెందిన వారిని ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలపై నోరు పారేసుకున్న తెలంగాణాకు చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జగన్‌ తనను గెలిపించిన రాష్ట్ర ప్రజల మనోభావాలకు గౌరవం ఇవ్వడం లేదని జడ శ్రావణ్‌కుమార్‌ తప్పుబట్టారు. 

Updated Date - 2022-05-19T01:33:25+05:30 IST