ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు..

ABN , First Publish Date - 2020-07-06T20:03:28+05:30 IST

అమరావతి: ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పనిదినాలను కుదించింది.

ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు..

అమరావతి: ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పనిదినాలను కుదించింది. ఈ నెల 13 నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.. వారానికి రెండ్రోజులు పనిచేసేలా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు సర్క్యులర్ జారీ చేశారు. బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో టచ్‌లో ఉండే విధంగా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై 10వ తేదీలోపు హెడ్మాస్టర్లు, టీచర్లు యుడైస్ ఫ్లస్ డేటాను రిజిస్టర్‌లో అప్ డేట్ చేయాలని చినవీరభద్రుడు తెలిపారు.


Updated Date - 2020-07-06T20:03:28+05:30 IST