వాటిపై మాట్లాడే దమ్ము బీజేపీకి ఉందా?: Tammineni

ABN , First Publish Date - 2021-12-28T19:17:28+05:30 IST

బీజేపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాటిపై మాట్లాడే దమ్ము బీజేపీకి ఉందా?: Tammineni

శ్రీకాకుళం: బీజేపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాగ్రహ సభలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీపై మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎందరో త్యాగాల వల్ల స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందన్నారు. మహనీయుల త్యాగాలు ప్రైవేట్‌పరం కావడానికా అని మండిపడ్డారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మోదీ, నిర్మలాతో మాట్లాడాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-28T19:17:28+05:30 IST