సీఎంను కలుస్తా.. యాక్షన్లోకి వెళ్లిపోతా: స్పీకర్ తమ్మినేని భార్య
ABN , First Publish Date - 2021-03-07T16:18:12+05:30 IST
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి వాణిశ్రీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఆముదాలవలస: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి వాణిశ్రీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వాణిశ్రీ.. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు స్థానిక సమస్యలను వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను విజయవాడ వెళ్లి సీఎంను కలుస్తానని, ఈ విషయంపై యాక్షన్లోకి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.