Ap Special Status మరోసారి వివాదాస్పదం అవుతోందా?
ABN , First Publish Date - 2022-07-20T00:52:24+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదా (Ap Special Status)పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొంది. లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్...
న్యూఢిల్లీ (New Delhi): ఏపీకి ప్రత్యేక హోదా (Ap Special Status)పై కేంద్రప్రభుత్వం (Central Government) మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొంది. లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (Tdp Mp Rammohan Naidu) ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ (central minister nityanand rai)లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ‘‘ఏపీకి ప్రత్యేక హోదా మరోసారి వివాదాస్పదం అవుతోందా?. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్న ఏంటి?. కేంద్రమంత్రి పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానమేంటి?. ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి తేలిపోయాక జగన్ ఏం చేయబోతున్నారు?. హోదాపై పెద్ద కబుర్లు చెప్పిన జగన్ ప్రత్యక్ష పోరు చేయబోతున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు..