రెవెన్యూ లోటుపై పాత లెక్కలు తీస్తున్న ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-03-09T17:17:47+05:30 IST

అమరావతి: రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలు ఆరా తీస్తోంది.

రెవెన్యూ లోటుపై పాత లెక్కలు తీస్తున్న ఏపీ ప్రభుత్వం

అమరావతి: రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎంతని కేంద్రం అడిగింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు పంపించారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసిన ఖర్చు వంటి వివరాలు పంపాలని ఆదేశాలిచ్చారు. చెల్లించని బిల్లుల వివరాలు కూడా పంపాలని స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-09T17:17:47+05:30 IST