మాకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు: పరిటాల Sunitha
ABN , First Publish Date - 2022-05-28T17:15:18+05:30 IST
‘‘మహనీయుడు ఎన్టీఆర్...మాకు రాజకీయ భిక్ష పెట్టారు’’ అని ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.
హైదరాబాద్: ‘‘మహనీయుడు ఎన్టీఆర్...మాకు రాజకీయ భిక్ష పెట్టారు’’ అని ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala sunitha) అన్నారు. ఎన్టీఆర్(NTR) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సునీత నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... సొంత కొడుకులతో సమానంగా ఎన్టీఆర్ పరిటాల రవిని చూసుకున్నారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని పరిటాల సునీత పేర్కొన్నారు.