ఏపీ వీఆర్వోల సంఘం విలీనం కాలేదు : రవీంద్ర రావు

ABN , First Publish Date - 2022-07-07T23:44:31+05:30 IST

అమరావతి: ఏపీ వీఆర్వోల సంఘం ఏ సంఘంతోనూ విలీనం కాలేదని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రావు చెప్పారు. ఏపీజేఏసీలో విలీనం కాలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్

ఏపీ వీఆర్వోల సంఘం విలీనం కాలేదు : రవీంద్ర రావు

అమరావతి: ఏపీ వీఆర్వోల సంఘం ఏ సంఘంతోనూ విలీనం కాలేదని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రావు చెప్పారు. ఏపీజేఏసీలో విలీనం కాలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో అనుబంధంగా పనిచేస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుందన్నారు. విలేజ్ రెవెమ్యా ఆఫీసర్‌లకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టుల భర్తీలో వీఆర్వోలకు అవకాశం కల్పించాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు ఒకే జాబ్ చార్ట్‌తో పనిచేస్తున్నందున అందరికీ ఒకే పే స్కేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-07-07T23:44:31+05:30 IST