Sailajanath: తూ తూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2022-09-17T20:56:28+05:30 IST
అసెంబ్లీ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు.
కర్నూలు: అసెంబ్లీ సమావేశాల(Assembly session)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Sailajanath) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ (AP Assembly)లో ప్రజా సమస్యలు చర్చించకుండా కేవలం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన (Buggana rajendranath) నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందరికి అందుబాటులో ఉండాలని అమరావతి రాజధానిగా ఒపుకున్నామన్నారు. జగన్ (CM Jagan) కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఏపీ హైకోర్టు (AP High court)ను కర్నూలుకు తరలించాలని, కొత్త పార్లమెంట్ భవనానికి బి.ఆర్.అంబేద్కర్ (BR Ambedkar) పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ (Rahul gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) వచ్చేనెల 20న కర్నూల్లో ప్రవేశిస్తుందని శైలజానాథ్ (APCC chief) తెలిపారు.