ప్రశాంత్‌ కిషోర్ ఓ బ్రోకర్: శైలజానాథ్

ABN , First Publish Date - 2021-12-04T01:09:17+05:30 IST

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ పై ఏపీసీసీ

ప్రశాంత్‌ కిషోర్ ఓ బ్రోకర్: శైలజానాథ్

అమరావతి: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్‌ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్, రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి ప్రశాంత్‌కు లేదన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ డబ్బులిస్తే.. ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేసే బ్రోకర్లు కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 




Updated Date - 2021-12-04T01:09:17+05:30 IST