బడ్జెట్‌లో గొప్పలు చెప్పడం విడ్డూరం: శైలజనాథ్

ABN , First Publish Date - 2022-03-08T01:16:51+05:30 IST

రాష్ట్రంలో పరిపాలన చేతకాని జగన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా

బడ్జెట్‌లో గొప్పలు చెప్పడం విడ్డూరం:  శైలజనాథ్

అమరావతి: రాష్ట్రంలో పరిపాలన చేతకాని జగన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ అన్నారు. సంక్షేమ పథకాల అమలు పేరుతో అప్పులు చేసి మరీ ఖజానా ఖాళీ అయినా గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నా, గవర్నర్ ఏనాడూ సీఎంను పిలిచి మాట్లాడలేదన్నారు. మూడు రాజధానుల బిల్లు విషయంలోలో గవర్నర్ కూడా తప్పు చేశారని ఆయన అన్నారు. ఈ బిల్లులు సరికాదని కోర్టులు కూడా చెప్పాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సంఘంపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదన్నారు. ఈసీని ఎవరికీ తెలియకుండా తొలగించారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ చట్టాన్ని రాత్రికి రాత్రే రద్దు చేసినా గవర్నర్ ప్రశ్నించకుండా సంతకం చేశారని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-08T01:16:51+05:30 IST