ప్రజల కష్టాలు పట్టవా: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2021-11-26T21:50:43+05:30 IST

జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు

ప్రజల కష్టాలు పట్టవా: శైలజానాథ్‌

కడప: జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు పట్టవా అని మంత్రులు, ఎమ్మెల్యేలను పీసీసీ శైలజానాథ్‌ నిలదీశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల రాజంపేట, నందలూరులో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. పింఛ డ్యామ్ తెగిపోగానే కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు. 



Updated Date - 2021-11-26T21:50:43+05:30 IST