సీఎం ఇంటి ముట్టడిని జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T05:21:13+05:30 IST

సీపీఎస్‌ రద్దుకై సెప్టెంబరు 1న తలపెట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ సీపీఎస్‌ జిల్లా నాయకుడు తిరుమలరెడ్డి పిలుపునిచ్చారు.

సీఎం ఇంటి ముట్టడిని జయప్రదం చేయాలి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు

 గుంటూరు(తూర్పు), ఆగస్టు 19: సీపీఎస్‌ రద్దుకై సెప్టెంబరు 1న తలపెట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ సీపీఎస్‌ జిల్లా నాయకుడు తిరుమలరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటశాల శ్రీనివాసరావుతో కలసి శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.  కార్యక్రమంలో ఎన్జీవో సంఘ కార్యదర్శి సతీష్‌కుమార్‌, బ్రహ్మారెడ్డి, శ్యామ్‌సుందర్‌, సాంబశివరావు, సూరి, నాగేశ్వరరావు, అనిల్‌, రామకృష్ణ, విజయ్‌, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T05:21:13+05:30 IST