ఏపీసీపీఎస్‌ఈఏ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-12-06T05:18:15+05:30 IST

ఏపీసీపీఎస్‌ఈఏ ఆద్వర్యంలో ఈనెల 10న నిర్వహించనున్న సింహగర్జన కార్యక్రమ పోస్టర్‌ను ఎంఈవో కేటీ మల్లికా ర్జుననాయక్‌ ఆవిష్కరించారు.

ఏపీసీపీఎస్‌ఈఏ పోస్టర్‌ ఆవిష్కరణ


త్రిపురాంతకం, డిసెంబరు 5: ఏపీసీపీఎస్‌ఈఏ ఆద్వర్యంలో ఈనెల 10న నిర్వహించనున్న సింహగర్జన కార్యక్రమ పోస్టర్‌ను ఎంఈవో కేటీ మల్లికా ర్జుననాయక్‌ ఆవిష్కరించారు. ఆదివారం విద్యావనరుల కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర గౌరవ సలహాదారు పఠాన్‌ బాజి మా ట్లాడుతూ ఎన్నికల ముందు జగన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబరు 10న విజయవాడలో ని ర్వహించనున్న కార్యక్రమానికి ప్రతి ఉద్యోగి హాజరుకావాలని కోరారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరేష్‌, ప్రధానకార్యదర్శి వెంకటరావు, ఉద్యో గులు, కోటేశ్వరరావు, జోసెఫ్‌, వాసు, పీటర్‌, భానుప్రసాద్‌, భాస్కరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-12-06T05:18:15+05:30 IST