ప్రశాంతంగా ఏపీఈఏపీ సెట్
ABN , First Publish Date - 2022-07-05T07:04:19+05:30 IST
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్-2022 సోమవారం ప్రారంభమైంది.
తొలిరోజు 91.7 శాతం హాజరు
విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్-2022 సోమవారం ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో తొమ్మిది, అనకాపల్లి జిల్లాలోని రెండు కేంద్రాల్లో తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండుపూటలా జరిగిన ఈ పరీక్షలకు 5,024 మందికిగాను 4,5,89 మంది (91.7 శాతం) హాజరయ్యారు. అనకాపల్లి జిల్లాలో రెండు కేంద్రాల్లో 510 మందికి 470 (92.16 శాతం) మంది, విశాఖ జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో 4,514 మందికిగాను 4,119మంది (91.25 శాతం) హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులను గంట ముందుగానే ప్రవేశం కల్పించారు. వాచీలు, ఎలక్ర్టానిక్ వస్తువులను అనుమతించలేదు.