పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా మోసంచేశారు: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-11-12T22:14:15+05:30 IST

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా మోసంచేశారు:  బొప్పరాజు

అమరావతి: పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని  ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 13 లక్షల మంది ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉందన్నారు. నివేదిక కాలయాపన కోసమే కమిటీ వేశారని ఆయన ఆరోపించారు. 




Updated Date - 2021-11-12T22:14:15+05:30 IST