రవీందర్కు ఉత్తమ సెర్ఫ్ ఏపీఎం అవార్డు
ABN , First Publish Date - 2022-05-20T05:41:50+05:30 IST
రవీందర్కు ఉత్తమ సెర్ఫ్ ఏపీఎం అవార్డు
ఇబ్రహీంపట్నం, మే 19: గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) ద్వారా బ్యాంకు లింకేజీ, గ్రౌండింగ్తో పాటు స్వయం సహాయక సంఘాలకు వివిధసేవలు అందించినందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సెర్ఫ్ ఏపీఎం పి.రవీందర్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవాఅవార్డు లభించింది. బుధవారం రాత్రి నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, సెర్ఫ్ సీఈవో సందీ్పకుమార్ సుల్తానియాల చేతులమీదుగా అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ సూచనల మేరకు తాము కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈఅవార్డుతో మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామని అన్నారు.