మంత్రి అప్పల రాజు, లోకేష్ మధ్య వాగ్వావాదం

ABN , First Publish Date - 2022-03-10T18:22:03+05:30 IST

ఏపీ శాసన మండలిలో మంత్రి అప్పలరాజు, నారా లోకేష్ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.

మంత్రి అప్పల రాజు, లోకేష్ మధ్య వాగ్వావాదం

అమరావతి: ఏపీ శాసన మండలిలో మంత్రి అప్పలరాజు, నారా లోకేష్ మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగింది. చేనేత కార్మికుల ఆత్మహత్యల పరిహారాన్ని టీడీపీ హయాంలో ఎందుకు పెంచలేదని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఇప్పుడు చేనేతకు ఈ ఏడాది ఎంత సబ్సిడీ ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. అయితే లోకేష్ ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేసి గతంలో మీరేం చేశారు అంటూ ఎదరు ప్రశ్నవేస్తూ... సబ్సిడీ కోసం నిధులు కేటాయించామని, ఇంకా విడుదల చేయాల్సి ఉందని మంత్రి అప్పలరాజు చెప్పారు.

Updated Date - 2022-03-10T18:22:03+05:30 IST