అప్పన్న చందనం విక్రయాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-30T05:54:24+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి చందన విక్రయాలు గురువారం ప్రారంభమయ్యాయి.

అప్పన్న చందనం విక్రయాలు ప్రారంభం
చందనం ప్యాకెట్‌ తీసుకుంటున్న భక్తుడు

సింహాచలం, జూలై 29: సింహాద్రి అప్పన్న స్వామి చందన విక్రయాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ చందనాన్ని స్వామివారిపై తీసినందున పవిత్రతో పాటు  అందులో కలిపే సుమారు 15 రకాల సుగంధ ద్రవ్యాల వల్ల ఆరోగ్యకారకమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే చందనానికి మంచి డిమాండ్‌ ఉంది. చందనోత్సవం జరిగి రెండు నెలలైనా కరోనా నిబంధనల వల్ల ఇప్పుడు చందనాన్ని ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చందనం టికెట్ల విక్రయాలు కొండదిగువ దర్శనం టికెట్లతో జారీ చేయడం, ఆ ప్యాకెట్లను సింహగిరిపై ప్రసాదాల కౌంటర్ల వద్ద ఇస్తున్నారు. అయితే ఆ సమాచారం తెలిపే బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. తొలిరోజైన గురువారం సుమారు 400 చందనం ప్యాకెట్లను విక్రయించారు. కౌంటర్లు తెరిచిన కాసేపటికే నిర్ణీత విక్రయాలు ముగియడంతో పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు. 


Updated Date - 2021-07-30T05:54:24+05:30 IST