గ్రూప్-1 ఫలితాలపై దాఖలైన అపీల్ను కొట్టేసిన ఏపీ High court
ABN , First Publish Date - 2022-06-24T18:10:49+05:30 IST
ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 ఫలితాలపై దాఖలైన అపీల్ను హైకోర్టు డివిజినల్ బెంచ్ కొట్టివేసింది.
అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 ఫలితాలపై దాఖలైన అపీల్ను హైకోర్టు డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. గ్రూప్ - 1 ఫలితాలకు సంబంధించి డిజిటల్, మాన్యువల్ ప్రశ్నా పత్రాలను రిజిస్ట్రార్ జనరల్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 ఫలితాలపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. జులై మొదటి వారంలోపు కౌంటర్ ఫైల్ చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.