నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-11-28T05:00:05+05:30 IST

వెన్నెలవలస నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో ఎస్‌.దేవేంద్రరావు తెలిపారు.

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు

మెళియాపుట్టి: వెన్నెలవలస నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో ఎస్‌.దేవేంద్రరావు తెలిపారు. శుక్రవారం దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. డిసెంబరు 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


పాతపట్నం: నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి డిసెంబరు 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో కె.రాంబాబు తెలిపారు. 2021 ఏప్రిల్‌ 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  

Updated Date - 2020-11-28T05:00:05+05:30 IST