ఉచిత బోర్ల మంజూరుకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-07-06T11:06:33+05:30 IST

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు ఉచిత బోర్ల మంజూరుకు చర్యలు చేపట్టింది.

ఉచిత బోర్ల మంజూరుకు దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 5: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతులకు ఉచిత బోర్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి శనివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి జిల్లా యంత్రాంగానికి జీవో నెం.64 పేరిట ఉత్తర్వులందాయి. అర్హులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లను తవ్వించి పైపులు, మోటరు, విద్యుత్తు కనెక్షన్‌ అమర్చి సహకరిస్తుంది.


ఐదెకరాలు సాగులో ఉండి, బోరులేని రైతులు ఈ పథకానికి అర్హులు. 2.5 ఎకరాల భూమి కలిగిన ఇద్దరు లేదా ముగ్గురు చిన్న, సన్నకారు రైతులు సంయుక్తంగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక గ్రామ సచివాలయం లేదా రైతుభరోసా కేంద్రాల్లో దరఖాస్తులకు పట్టాదారు పాసుబుక్కు, ఆధార్‌కార్డు జిరాక్స్‌పత్రాలను రైతులు అందజేయాల్సి ఉంది. ఎంపికైన అర్హుల సెల్‌ఫోన్‌కు అధికారులు సమాచారం అందజేశారు. అనంతరం జియాలజిస్టులు నీటిలభ్యతపై నివేదిక అందజేయగానే, ఆయా రైతుల పొలాల్లో మండల పరిషత్‌ అధికారులు ఉచితంగా బోర్ల తవ్వకం పనులు పూర్తి చేయిస్తారు. 

Updated Date - 2020-07-06T11:06:33+05:30 IST